MANAAPMS

Friday, April 19, 2013

ఆదర్శ పాఠశాలల సమాచారం : 1

2009-10 తాత్కాలిక బడ్జెట్‌లో ` 312.90 కేటాయింపు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా బ్లాక్‌ స్థాయిలో మెరుగైన విద్యను అందించేందుకు 6 వేల మోడల్‌ స్కూళ్లను ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం 2009-10 తాత్కాలిక బడ్జెట్‌లో ` 312.90 కోట్లను కేటాయించార . 2007 స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా బ్లాక్‌స్థాయిలో 6 వేల ఉన్నత ప్రమాణాల పాఠశాలల ఏర్పాటును ప్రధాని మన్మోహన్‌సింగ్‌ ప్రస్తావించారు. దీనితో బడ్జెట్‌లో వీటికి ప్రాధాన్యం లభించింది. ఈదఫా విద్యారంగానికి ` 41,978.21 కోట్లను కేటాయించారు. 2008-09 బడ్జెట్‌లో కేటాయించిన ` 37,366.57కోట్ల కంటే ఇది ` 4,611 కోట్లు ఎక్కువ. ఇందులో పాఠశాల విద్యకు ` 28,799.21 కోట్లు కేటాయించారు. ఉన్నత విద్యకు ` 13,179 కోట్లు దక్కాయి. మదర్సాలలో నాణ్యమైన విద్యను అందించే పథకానికి ఈ బడ్జెట్‌లో ` 45 కోట్లు కేటాయించగా, మైనార్టీ విద్యాసంస్థల్లో మౌలిక వసతుల మెరుగుకు ` 4.50 కోట్లు దక్కింది. మాధ్యమిక విద్య(సెకండరీ)ను బలోపేతం చేసేందుకు రాష్ట్రీయ మాధ్యమిక్‌ శిక్షా అభియాన్‌ (ఆర్‌ ఎమ్ ఎస్‌ ఏ) అనే నూతన పథకాన్ని బడ్జెట్‌లో ప్రకటించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ` 1,143.46 కోట్లు కేటాయించారు. సర్వశిక్షా అభియాన్‌ పథకం వల్ల ప్రాథమికోన్నత విద్యలో విద్యార్థుల సంఖ్య అంచనాలకు మించి పెరిగిపోవడంతో ఆ డిమాండ్‌ను తట్టుకునేందుకు వీలుగా ఆర్‌ ఎం ఎస్‌ ఏ పథకానికి రూపకల్పన చేశారు. విశ్వవిద్యాలయ నిధుల కమిషన్‌ (యూ జీ సీ)కి ఈ దఫా ` 6,545.11 కోట్లు కేటాయించారు. గత ఆర్థిక సంవత్సరం కేటాయింపులు ` 5,482.36 కోట్లతో పోలిస్తే ఇది ` 1,062.75 కోట్లు అదనం. దేశంలో నూతనంగా 15 కేంద్రీయ విశ్వవిద్యాలయాల స్థాపనకు సంబంధించిన ఆర్డినెన్స్‌ను జారీచేసినట్లు కేంద్రం ప్రకటించింది. త్వరలోనే ఇవి ప్రారంభంకానున్నాయి. 2008-09 ఆర్థిక సంవత్సరంలో ఆరు కొత్త ఐ ఐ టీ లను.. బీహార్‌, ఆంధ్రప్రదేశ్‌, రాజస్థాన్‌, ఒరిస్సా, పంజాబ్‌, గుజరాత్‌లో ప్రారంభించారు. మరో రెండు ఐ ఐ టీ లు మధ్యప్రదేశ్‌, హిమాచల్‌ప్రదేశ్‌లలో అందుబాటులోకి రానున్నాయి. విజయవాడ, భోపాల్‌ ఆర్కిటెక్‌కళాశాలల్లో 2009-10 విద్యా సంవత్సరం నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి.

No comments:

Post a Comment